అల్లరి నరేష్ మూవీకి ఓటిటి లో భారీ రెస్పాన్స్

అల్లరి నరేష్ మూవీకి ఓటిటి లో భారీ రెస్పాన్స్

Published on Dec 27, 2022 11:08 PM IST

అల్లరి నరేష్ హీరోగా ఏ ఆర్ మోహన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సోషల్ డ్రామా యాక్షన్ మూవీని జీ స్టూడియోస్ వారితో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా గ్రాండ్ గా నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఇక కొద్దిరోజుల క్రితం ఈ మూవీని ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 లో విడుదల చేయగా దీనికి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ ప్రస్తుతం తమ ఓటిటి లో టాప్ స్థానంలో ట్రెండ్ అవుతోందని కొద్దిసేపటి క్రితం జీ 5 ఇండియా వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మొత్తంగా తమ సినిమా అటు థియేటర్స్ లో అలానే ఇటు ఓటిటి లో ఆడియన్స్ ని ఆకట్టుకున్నందుకు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు