యూనివర్సల్ అప్పీల్ తో మూవీస్ చేస్తానంటున్న తమిళ హీరో

యూనివర్సల్ అప్పీల్ తో మూవీస్ చేస్తానంటున్న తమిళ హీరో

Published on Mar 10, 2013 6:41 PM IST

Karthi

తమిళ హీరో కార్తీ, అనుష్క జంటగా నటించిన ‘బ్యాడ్ బాయ్’ సినిమా మార్చి 22న విడుదల కానుంది. సూరజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కె.ఈ జ్ఞానవేల్ రాజ్ నిర్మాత. ఈ సినిమా జనవరిలో ‘అలెక్స్ పాండ్యన్’ గా తమిళ్ లో విడుదలైంది. గత సంవత్సరం కార్తీ తెలుగులో డైరెక్ట్ సినిమా చేయ్యనున్నాడనే వార్తలు వచ్చాయి. గతంలో కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘నా పేరు శివ’ సినిమాలు తెలుగులో హిట్ అవ్వగా ‘శకుని’, ‘మల్లిగాడు’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

కార్తీ సినిమాలను ఎలా ఎంచుకుంటాడా అనే విషయం గురించి మాట్లాడుతూ ‘ నన్ను ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఎ.పిలో నా పేరు శివ బాగా ఆడింది కానీ మల్లిగాడు ఆడలేదు. దాంతో మల్లిగాడు లాంటి సినిమా చెయ్యకూడదని నిర్ణయించుకున్నానని’ అన్నాడు. తెలుగులో డైరెక్ట్ సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ డైరెక్ట్ తెలుగు సినిమాకి డబ్ సినిమాకి పెద్ద తేడా లేదు. నా అన్ని సినిమాలు తెలుగులోకి డబ్ అవుతాయి, అలాగే నేనే స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాను. అందుకే నేను యూనివర్సల్ అప్పీల్ తో సినిమాలు చేస్తాను. అందువల్లే నా సినిమాలకు తెలుగు – తమిళ అనే బౌండరీలు ఉండవని’ అన్నాడు.

ప్రస్తుతం కార్తీ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘బిర్యాని’, ఎమ్. రాజేష్ దర్శకత్వంలో ‘ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు