అమెరికాలో పనిచేయని పూరి మాస్ మంత్రం

అమెరికాలో పనిచేయని పూరి మాస్ మంత్రం

Published on Jul 23, 2019 3:00 AM IST

రామ్ నటించిన కొత్త చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ బ్రహ్మాండమైన వసూళ్లతో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ మాస్ ట్రీట్మెంట్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి బాగా నచ్చింది. బి, సి సెంటర్ల ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రామ్ కెరీర్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు ఖాతాలో పడుతున్నాయి. నాలుగు రోజులు గాను తెలుగు రాష్ట్రాల్లో రూ.21.42 కోట్లు రాబట్టిందీ చిత్రం.

ఇక్కడ ఇంతా బాగా ఆడుతున్నా ఓవర్సీస్ ప్రేక్షకుల మీద మాత్రం ఈ మాస్ మంత్రం అంతగా పనిచేయలేదు. ప్రీమియర్ల ద్వారా 51,677 డాలర్లను, గురువారం 31,893, శుక్రవారం 41,579, శనివారం 56,898 డాలర్లును రాబట్టిన ఈ సినిమా మూడు రోజులకు కలిపి 183,338 డాలర్లను మాత్రమే ఖాతాలో వేసుకుంది. ఏపీ, తెలంగాణలో వసూళ్ళకి ఈ వసూళ్లకు చాలా వ్యత్యాసమే ఉంది. దీనిబట్టి అమెరికా ఆడియన్స్ పూరి నుండి కొత్తదనాన్ని ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. పైగా చిత్రాన్ని తక్కువ లొకేషన్లలో విడుదల చేయడం కూడా ఈ వసూళ్లు తగ్గడానికి మరొక ప్రధాన కారణం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు