వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న కాజల్ లేటెస్ట్ మూవీ!

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న కాజల్ లేటెస్ట్ మూవీ!

Published on Apr 20, 2023 5:34 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రీసెంట్ గా కోస్టీ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళం లో ఘోస్టీ గా వచ్చిన ఈ చిత్రం థియేటర్ల లో ఆడియెన్స్ ను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 23, 2023న జీ తెలుగులో ప్రసారం కానుంది.

కళ్యాణ్ దర్శకత్వంలో సీడ్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. అయితే కాజల్ తదుపరి ఇండియన్2 మూవీ లో కనిపించనుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై కాజల్ అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు