సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ ను ఈ నెల 26వ తేదీ నుండి హైదరాబాద్లో తిరిగి ప్రారంభమవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సెకెండ్ షెడ్యూల్ కోసం కర్నూలులోని ప్రసిద్ధమైన కొండారెడ్డి బురుజును ఆర్ఎఫ్సిలో సెట్ వేస్తున్నారు.
కాగా ఈ సెకెండ్ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.