సాంగ్స్ తోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న “సర్కారు వారి పాట”

సాంగ్స్ తోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న “సర్కారు వారి పాట”

Published on Apr 24, 2022 5:02 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం ను మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి.

ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ పాటకు 7.2 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలకు భారీ రెస్పాన్స్ రావడం విశేషం. సాంగ్స్ తో నే ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు పవర్ ఫుల్ యాక్షన్ ను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకం పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు