రెండోసారి డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “మంగళవారం”

రెండోసారి డీసెంట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “మంగళవారం”

Published on Mar 22, 2024 12:00 AM IST

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా మంగళవారం. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండోసారి కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్ వెలువడింది. రెండోసారి స్టార్ మా లో ప్రసారం అయిన ఈ సినిమా 4.05 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ప్రియదర్శి, నందిత శ్వేత, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు