టాక్ : అప్పటి వరకు చరణ్ ఫ్యాన్స్ ఆగాల్సిందేనా ?

టాక్ : అప్పటి వరకు చరణ్ ఫ్యాన్స్ ఆగాల్సిందేనా ?

Published on Apr 28, 2024 12:02 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ఇక మరోవైపు కమల్ హాసన్ తో భారీ మూవీ భారతీయుడు 2 కూడా తీస్తున్నారు శంకర్. ఈ మూవీని జూన్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఆ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే పక్కాగా భారతీయుడు 2 రిలీజ్ డేట్ ఖరారైన తరువాతనే ఈ మూవీ రిలీజ్ పై టీమ్ నుండి క్లారిటీ రానుందని, అప్పటి వరకు చరణ్ ఫ్యాన్స్ ఆగాల్సిందే అని అంటున్నాయి సినీ వర్గాలు. కాగా ఈ రెండు సినిమాల పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు