బజ్ : ఇళయదళపతి విజయ్ 69 లో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ?

బజ్ : ఇళయదళపతి విజయ్ 69 లో ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ?

Published on Apr 28, 2024 3:01 AM IST

కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చి త్రం గోట్‌ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో స్నేహ, లైలా, ప్రభుదేవా,ప్రశాంత్‌, వైభవ్‌, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీనిని సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు.

అయితే దీని అనంతరం విజయ్‌ తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. ఇక ఇదే ఈయన చివరి చిత్రం అని తెలుస్తోంది. దానికి కారణం విజయ్‌ రాజకీయరంగ ప్రవేశం చేయడమే. కాగా ఆయన చివరి చిత్రానికి హెచ్‌ వినో ద్‌ దర్శకత్వం వహించనున్నారన్న వార్త కూడా ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అయితే వీరి క్రేజీ కాంబో మూవీని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందనేది కూడా తెలియాల్సి ఉంది.

మ్యాటర్ ఏమిటంటే, ఇందులో విజయ్‌తో జతకట్టే హీరోయిన్స్ గురించి ప్రస్తుతం ఒక న్యూస్ కోలీవుడ్ లో ప్రచారం అవుతోంది. దాని ప్రకారం స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తీసురేష్‌ ఈ క్రేజీ ప్రాజక్ట్ లో నటించనున్నారని అంటున్నారు. కాగా సమంత ఇంతకు ముందు విజయ్‌ సరసన కత్తి, తెరి, మెర్సల్‌ చిత్రాల్లో అలానే కీర్తీ సురేష్‌ ఇంతకు ముందు భైరవ, సర్కార్‌ చిత్రాలలో జత కట్టారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్‌తో రొమాన్స్‌ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. మొత్తంగా అయితే ఈ విషయమై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు