మెగాస్టార్ “భోళా శంకర్” ఓటిటి పార్ట్నర్ లాక్.!

మెగాస్టార్ “భోళా శంకర్” ఓటిటి పార్ట్నర్ లాక్.!

Published on Jan 14, 2023 7:00 PM IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీబీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో “వాల్తేరు వీరయ్య” చిత్రం రిలీజ్ అయ్యి థియేటర్స్ లో మాసివ్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా అదిరే ఆక్యుపెన్సీతో స్టార్ట్ కాగా మళ్ళీ మెగాస్టార్ ర్యాంపేజ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం తాలూకా ఓటిటి హక్కులు అయితే దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నే సొంతం చేసుకోగా ఇప్పుడు మరో సినిమాని వీరు కొనుగోలు చేసినట్టుగా అధికారికంగా అనౌన్స్ చేశారు.

మరి ఆ చిత్రం మెగాస్టార్ నుంచి ఈ ఏడాది లోనే రాబోయే మరో చిత్రం “భోళా శంకర్” కాగా ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ న్యూస్ ని మంచి ఎగ్జైట్మెంట్ తో నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేసి థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలి పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు