ఓటిటిలో పాన్ ఇండియా రిలీజ్ కి మోహన్ లాల్ భారీ చిత్రం

ఓటిటిలో పాన్ ఇండియా రిలీజ్ కి మోహన్ లాల్ భారీ చిత్రం

Published on Feb 20, 2024 9:00 AM IST

మళయాళ సినిమా స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన రీసెంట్ గా వచ్చిన చిత్రాల్లో “నెరు” మంచి హిట్ కాగా ఈ చిత్రం తర్వాత ఈ ఏడాదిలో వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రం “మలైకోట్టై వాలిబన్” కూడా ఒకటి. మరి దర్శకుడు లిజో జోస్ పెల్లిసరి తెరకెక్కించిన ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. మరి ఈ సినిమా గత 26 రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేసారు.

కానీ సినిమా బడ్జెట్ కి తగ్గ రేంజ్ లో వసూళ్లు రానట్టే తెలిసింది. ఇక కేవలం మళయాళంలో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న డిస్నీ+ హాట్ స్టార్ వారు ఈ సినిమాని నెల లోపే ఈ ఫిబ్రవరి 23న మళయాళం సహా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. మరి ఓటిటిలో వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు