“ది ఘోస్ట్‌” లో యాక్షన్, డ్రామా రెండింటినీ బ్యాలెన్స్ చేశారు ప్రవీణ్ సత్తారు – నాగార్జున

“ది ఘోస్ట్‌” లో యాక్షన్, డ్రామా రెండింటినీ బ్యాలెన్స్ చేశారు ప్రవీణ్ సత్తారు – నాగార్జున

Published on Sep 26, 2022 12:09 AM IST

అక్కినేని నాగార్జున లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. ఈ చిత్రం అక్టోబర్ 5 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ వేగవంతం గా ప్రమోషన్స్ షురూ చేయడం జరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు ఫస్ట్ సింగిల్ సినిమాకి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు కర్నూలులో జరిగింది.

ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమకు తన తండ్రి ఏఎన్‌ఆర్‌కి కృతజ్ఞతలు అని అన్నారు. అదే అక్టోబర్ 5న విడుదలైన తన కల్ట్ హిట్ శివ గురించి నాగార్జున గుర్తు చేసుకున్నాడు. మరియు అతను మరోసారి ది ఘోస్ట్‌ తో అదే తేదీకి వస్తున్నట్లు చెప్పాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్‌లో యాక్షన్, డ్రామా రెండింటినీ బ్యాలెన్స్ చేశాడని నాగార్జున అన్నారు. దర్శకుడు తనతో పాటు తన టీమ్ మొత్తం సినిమా కోసం చాలా కష్టపడేలా చేసారని పేర్కొన్నాడు.

ఈ ఈవెంట్‌కి చై మరియు అఖిల్ ఇద్దరినీ ఆహ్వానించిన విషయాన్ని తెలిపారు, అన్నమయ్య సినిమా సమయంలో చివరిసారిగా కర్నూలుకు వచ్చా, ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానులందరికీ ధన్యవాదాలు అని అన్నారు. నటుడు తన ప్రియమైన మరియు సన్నిహిత మిత్రుడు చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ సైతం అక్టోబర్ 5 వ తేదీన విడుదల అవుతున్న విషయాన్ని వెల్లడించారు. ఆ చిత్రం కూడా విజయం సాధించాలి అని శుభాకాంక్షలు తెలియజేసారు. అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు