అప్పట్లోనే ప్రభాస్ క్రేజ్ చూసి హీరో అయ్యా..నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అప్పట్లోనే ప్రభాస్ క్రేజ్ చూసి హీరో అయ్యా..నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Apr 10, 2024 10:11 AM IST


మన తెలుగు సినిమా దగ్గర ఉన్న పలువురు స్టార్ హీరోస్ లో భారీ స్థాయి క్రేజ్ ఉన్నటువంటి వారిలో పాన్ ఇండియా సినిమాని రూల్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్ (Prabhas) కూడా ఒకడు. మరి తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా లాంటి సినిమాలు చేయకముందే భారీ స్థాయిలో క్రేజ్ ని ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. తనకి హిట్ పడే కొద్దీ అభిమానుల సంఖ్య ఓ రేంజ్ లో పెరుగుతూ వచ్చింది.

అయితే ప్రభాస్ కి సెన్సేషనల్ బ్రేక్ ఇచ్చిన “వర్షం” సినిమా టైం లోనే అతని క్రేజ్ చూసి షాకయ్యానని టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. రీసెంట్ గానే తన నుంచి “ఇన్స్పెక్టర్ రిషి” (Inspector Rishi) అనే సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ క్రేజ్ పై మాట్లాడాడు.

తాను అప్పట్లో “వర్షం” సినిమా 50 రోజుల ఫంక్షన్ భీమవరంలో చేసినపుడు ఓ సాంగ్ పెర్ఫామ్ చేయడానికి వెళ్లానని అప్పుడికి ప్రభాస్ మహా అయితే నాలుగైదు సినిమాలు చేసుకుంటారు కానీ ఆ 50 రోజుల ఫంక్షన్ కి ఇంచుమించు 5 నుంచి 6 లక్షల మంది జనం వచ్చుంటారని అలా తాను కూడా హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యి సినిమాల్లోకి వచ్చి ఇప్పటికీ మంచి మంచి కథలు కోసం చూస్తూనే ఉన్నానని తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు