పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య భారీగా తెరకెక్కుతుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా రాబోతుంది. ఐతే, తాజాగా ఈ సినిమాని జూన్ 16, 2023 కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “ప్రేక్షకులకు పూర్తిగా అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడానికి, మాకు మరింత సమయం కావాలి. భారతదేశం గర్వించదగ్గ సినిమా చేయడానికే మేము కట్టుబడి ఉన్నాము. మీ అందరి మద్దతు, ప్రేమ మరియు ఆశీస్సులే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి” అని పోస్ట్ పెట్టాడు.
ఈ ప్రాజెక్ట్పై ఆదిపురుష్ టీమ్ VFX కోసం సుమారు 100-150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినికిడి. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, అదే విధంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే.
जय श्री राम…#Adipurush releases IN THEATRES on June 16, 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @RETROPHILES1 @UV_Creations @Offladipurush pic.twitter.com/kXNnjlEsib
— Om Raut (@omraut) November 7, 2022