లేటెస్ట్…డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “ఓం భీమ్ బుష్”

లేటెస్ట్…డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “ఓం భీమ్ బుష్”

Published on Apr 8, 2024 1:03 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ (Om Bheem bush) ఇటీవల థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ పై ప్రకటన వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 12, 2024 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంను థియేటర్లలో మిస్ అయిన లేదా మళ్లీ చూడాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్, మనీష్ కుమార్ మరియు రచ్చ రవి లు కీలక పాత్రల్లో నటించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు