ధనుష్ “కెప్టెన్ మిల్లర్” ఓటిటి రిలీజ్ డేట్ ఖరారు.!

ధనుష్ “కెప్టెన్ మిల్లర్” ఓటిటి రిలీజ్ డేట్ ఖరారు.!

Published on Feb 2, 2024 5:00 PM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ డ్రామా “కెప్టెన్ మిల్లర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది అలాగే గత వారమే తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి అయితే డేట్ లాక్ చేసుకుంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 9 నుంచి సౌత్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రావడానికి సిద్ధం అయ్యింది. దీనితో కెప్టెన్ మిల్లర్ ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు