తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయడంకా మోగించి తిరిగి పార్టీ ని అధికారంలో నిలబెట్టిన తెరాస అధినేత కేసీఅర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.
తెలంగాణ ను తెచ్చి పెట్టిన తెరాస కు అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టి వారి మనుసులో మాటను మరో సరి చాటి చెప్పారు. ఈ విజయానికి కారణమైన కేసీఆర్ , కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ ఓ లేఖ ను విడుదలచేశారు.
కె. సీ. ఆర్ గారికి శుభాభినందనలు – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/thcgVNxLOd
— JanaSena Party (@JanaSenaParty) December 11, 2018