ఫోటో మూమెంట్ : ప్రశాంత్ నీల్, కాంతార దర్శకునితో మ్యాన్ ఆఫ్ మాసెస్

ఫోటో మూమెంట్ : ప్రశాంత్ నీల్, కాంతార దర్శకునితో మ్యాన్ ఆఫ్ మాసెస్

Published on Mar 2, 2024 6:55 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకులు కొరటాల శివతో భారీ చిత్రం “దేవర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండగా ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నారు. అయితే ఈ బ్రేక్ లో ఎన్టీఆర్ ఓ ప్రైవేట్ పార్టీకి హాజరు కానున్నారు. మరి ఈ సమయంలో ఎన్టీఆర్ పై కొన్ని పిక్స్ బయటకొచ్చి వైరల్ గా మారాయి.

మెయిన్ గా ఓ పిక్ అయితే సూపర్ స్పెషల్ గా మారింది. కన్నడ సినిమా దగ్గర తమ చిత్రాలతో వన్నె తెచ్చిన సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే కాంతార హీరో మరియు దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి లతో తారక్ ఇప్పుడు కనిపించాడు. దీనితో ఈ పవర్ఫుల్ పిక్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది. ఇక నీల్ అయితే రీసెంట్ గానే సలార్ తో భారీ హిట్ అందుకోగా నెక్స్ట్ ఎన్టీఆర్ తో కూడా భారీ సినిమా చేయనున్నాడు అలాగే రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు