‘సైంధవ్’ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ టీవీ ఛానల్

‘సైంధవ్’ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ టీవీ ఛానల్

Published on Dec 6, 2023 10:00 PM IST


విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై వెంకటేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచాయి.

సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ తెలుగు టివి ఛానల్ ఈటీవీ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇంకా ఈ మూవీలో రుహాణి శర్మ, ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్దిఖీ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు