రెండో షెడ్యూల్ లో రాజ్ తరుణ్ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’

రెండో షెడ్యూల్ లో రాజ్ తరుణ్ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’

Published on Oct 13, 2019 12:20 AM IST

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్‌ అక్టోబర్‌ 12 నుంచి ప్రారంభమైంది. గతంలో దర్శకుడు కొండా విజయ్ కుమార్ తెరకెక్కించిన గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ పై కూడా అంచనాలు బాగున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ”ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ ఈరోజు నుంచి ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన క్యూట్‌ లవ్‌స్టోరీ ఇది. సెన్సిటివ్‌ లవ్‌స్టోరీ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కొండా విజయ్‌కుమార్‌గారు మరో డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నంద్యాల రవి చాలా మంచి డైలాగ్స్‌ రాశారు. ఈ చిత్రంలో వాణీవిశ్వనాథ్‌గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు