‘రణరంగం’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

‘రణరంగం’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jul 24, 2019 2:02 AM IST

హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో ‘రణరంగం’ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబధించిన వర్క్ చివరి దశలో ఉందట. ప్రస్తుతం శర్వానంద్ ఈ సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్నాడు. ఇప్పటికే మిగిలిన నటీనటులు కూడా ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం పూర్తయిందట. వచ్చే నెల మొదటి వారం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి సంబంధించి మొత్తం పని పూర్తి కానుందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఎమోషన్స్ తో కూడినదై ఉంటుందని శర్వానంద్ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతుంది చిత్రబృందం. కాగా ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు