సీక్వెల్ కి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ !

సీక్వెల్ కి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ !

Published on Dec 10, 2018 4:46 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ సూపర్ హిట్ చిత్రం ‘మర్ధానీ’ సీక్వెల్ కి ఒకే చెప్పారని సమాచారం. యాష్ రాజ్ స్టూడియోస్ పతాకం ఫై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గోపి పుత్రాన్ తెరకెక్కించనున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక 2014 లో వచ్చిన ఒరిజినల్ వెర్షన్ మర్ధానీ సెన్సేషనల్ హిట్ అయ్యి బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాణి ముఖర్జీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించింది. ప్రదీప్ సర్కార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు