ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన సూపర్ స్టార్ చిత్రబృందం !

ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన సూపర్ స్టార్ చిత్రబృందం !

Published on Nov 17, 2018 2:15 AM IST

సూపర్‌ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘2.ఓ’ చిత్రం ఇప్పటికే విడుదలకు సన్నధం అవుతుంది.

అత్యంత భారీ బడ్జెట్ తో భారీగా రూపొందిన ఈ చిత్రం కోసం తెలుగు తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ ను భారీ ఎత్తులో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా హైదరాబాద్ లో కూడా ‘2.ఓ’ మేకర్స్ భారీగానే ప్రమోషన్స్ చెయ్యటనికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి.

మొత్తానికి విజువల్‌ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ లు సినిమా పై అంచనాలను బాగానే పెంచింది.శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు