మరోసారి సూపర్ రెస్పాన్స్ తో “సరిలేరు నీకెవ్వరు”

మరోసారి సూపర్ రెస్పాన్స్ తో “సరిలేరు నీకెవ్వరు”

Published on Mar 21, 2024 6:36 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం జనవరి 11, 2020 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఇటీవల జెమిని టీవీ లో ప్రసారం కాగా, మరోసారి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 4.20 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అధ్బుతమైన సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు