యూఎస్ లో కంటిన్యూ అవుతున్న “సర్కారు వారి పాట” హవా.!

యూఎస్ లో కంటిన్యూ అవుతున్న “సర్కారు వారి పాట” హవా.!

Published on May 21, 2022 3:01 PM IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్ ని అందుకుంటున్నట్టుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు.

మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2.2 మిలియన్ డాలర్స్ గ్రస్స్ మార్క్ ని క్రాస్ చేసి స్టడీగా కంటిన్యూ అవుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే సముద్రఖని, సుబ్బరాజ్ మరియు నదియా తదితరులు ఈ చిత్రంలో కీలక పత్రాలు చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు