విషాదం : “మొగలిరేకులు, చక్రవాకం” సీరియల్ నటుడు కన్నుమూత

విషాదం : “మొగలిరేకులు, చక్రవాకం” సీరియల్ నటుడు కన్నుమూత

Published on Mar 2, 2024 1:17 PM IST

తెలుగు బుల్లితెర వద్ద సంచలన విజయాలు అయ్యినటువంటి పలు డ్రామా సీరియల్స్ లో రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన సీరియల్స్ “చక్రవాకం” గాని “మొగలిరేకులు” సీరియల్స్ ని తెలుగు బుల్లితెర వీక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. మరి ఈ సీరియల్స్ లో కనిపించి తమదైన పెర్ఫామెన్స్ లతో యువ నటీనటులు ఆకట్టుకోగా అయితే ఈ రెండు సీరియల్స్ లో కూడా ఓ ముఖ్య పాత్రలు చేసిన ప్రముఖ నటుడు పవిత్రనాథ్ ఇప్పుడు కన్ను మూశాడన్న వార్త షాకింగ్ గా మరియు విషాదంగా మారింది.

అయితే తాను గత కొన్నాళ్ల నుంచి పలు ఇబ్బందులో ఉన్నాడని వీటితో మానసికంగా కూడా తాను దెబ్బ తినడం వంటి కారణాలు చేత తాను తన తుది శ్వాస విడిచినట్టుగా కొన్ని వైరల్ అవుతున్నాయి కానీ తన మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది బయటకి రాలేదు. కానీ ఈ విషాద వార్తతో మాత్రం ఆ సీరియల్స్ కోసం ఈ నటుడు కోసం తెలిసినవారు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరి పవిత్రనాథ్ ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ కూడా కోరుకుంటుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు