విషాదం : ప్రముఖ సింగర్ మృతి !

విషాదం : ప్రముఖ సింగర్ మృతి !

Published on Dec 27, 2021 7:01 AM IST

ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. సింగర్ గా ఆయన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాగే నటుడిగా కూడా ఆయన పలు చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించారు. అయితే, మాణిక్య వినాయగం పాడిన ప్రతి పాట మంచి విజయాన్ని సాధించేది.

సంగీత అభిమానుల్ని మాణిక్య వినాయగం పాట ఉర్రూతలూగించేది. అంత గొప్పగా ఆయన పాట పాడేవారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలో కూడా ఆయన ఒక పాట పాడారు. ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ అంటూ ఆయన తన గొంతుతో మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చారు. అలాంటి సింగర్ నేడు లేకపోవడం బాధాకరమైన విషయం.

మాణిక్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు. మాణిక్య ఎప్పటికీ తన పాటల ద్వారా వెండితెర పై చిరంజీవిగానే వుంటారు , 123తెలుగు.కామ్ తరఫున మాణిక్య మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు