ఫోటో మొమెంట్ : రజినీకాంత్ కు చెక్ అందచేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్

ఫోటో మొమెంట్ : రజినీకాంత్ కు చెక్ అందచేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్

Published on Sep 1, 2023 1:30 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రమ్యకృష్ణ, సునీల్, యోగిబాబు, వినాయకన్, వసంత్ రవి, మిర్నా మీనన్, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ జైలర్. ఈ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ దీనిని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఇక ఆగష్టు 10న రిలీజ్ అయిన జైలర్ సూపర్ డూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ తో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది.

అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ యొక్క సక్సెస్ పై రజినీకాంత్ తో పాటు యూనిట్ మొత్తం కూడా అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే విషయం ఏమిటంటే, తమ సినిమా పెద్ద చారిత్రాత్మక విజయం సొంతం చేసుకోవడంతో నేడు హీరో రజినీకాంత్ కి ప్రత్యేకంగా ఒక చెక్ ని అందచేశారు నిర్మాత కళానిధి మారన్. వారిద్దరూ కలిసి ఉన్న ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవకాశం వస్తే తన అభిమాన సూపర్ స్టార్ రజినీకాంత్ తో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధం అని అన్నారు మారన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు