‘కమిట్మెంట్’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన తేజస్వి

‘కమిట్మెంట్’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన తేజస్వి

Published on Aug 15, 2022 11:00 PM IST

తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ఒక చిన్న రోల్ ద్వారా టాలీవుడ్ కి నటిగా పరిచయం అయింది తేజస్వి మదివాడ. ఆ మూవీ హిట్ కొట్టిన అనంతరం ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న ఆమె, ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం తేజస్వి నటిస్తున్న మూవీ కమిట్మెంట్. యదార్ధ ఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందింది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి అయిన ఈ చిత్రం ఫైనల్ గా పలు వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు రానుంది.

రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజస్వి మదివాడ ,ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆగష్టు 19న ఈ మూవీ రిలీజ్ కానుండడంతో దీని గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు తేజస్వి. ఈ మూవీలో మొత్తం నాలుగు స్టోరీలు ఉంటాయి, ఇందులో నాది సినిమా అవకాశాల కోసం తిరిగే అమ్మాయి పాత్ర. నిజానికి ఈ మూవీ ట్రైలర్ చూసిన వారందరూ కూడా మా మూవీ, ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెడుతుందని భావిస్తున్నారు, కానీ కమిట్మెంట్ అనే పాయింట్ ని బేస్ చేసుకుని మెసేజ్ ఓరియెంటెడ్ కథతో సాగేదే ఈ మూవీ సాగుతుంది, అలానే తప్పకుండా మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు