నార్త్ ఆడియెన్స్ కి ఈ డేట్ నుంచి “కెప్టెన్ మిల్లర్” స్ట్రీమింగ్

నార్త్ ఆడియెన్స్ కి ఈ డేట్ నుంచి “కెప్టెన్ మిల్లర్” స్ట్రీమింగ్

Published on Mar 2, 2024 12:14 AM IST

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన రీసెంట్ యాక్షన్ డ్రామా చిత్రం “కెప్టెన్ మిల్లర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయగా తమిళ్ సహా ఇతర భాషల్లో కూడా చాలా యావరేజ్ గానే నిలిచింది. మరి ఈ చిత్రం కొన్ని రోజులు కితమే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాగా ఇప్పుడు ఈ చిత్రం హిందీ ఆడియెన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

మరి హిందీ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే కన్ఫర్మ్ చేయగా ఇందులో ఈ చిత్రం ఈ మార్చ్ 8 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా ప్రైమ్ వీడియో వారు డేట్ అనౌన్స్ చేశారు. దీనితో ఆరోజు నుంచి నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రాల్లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. అలాగే శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ లు ముఖ్య పాత్రలు చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు