టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్న “గుంటూరు కారం”

టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్న “గుంటూరు కారం”

Published on Jan 7, 2024 3:03 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ భారీ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, పాటలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కి సంబందించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి మరొక కీలక పాత్రలో నటించడం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు