‘పెటా’లో తన పాత్ర గురించి చెప్పిన స్టార్ హీరో !

‘పెటా’లో తన పాత్ర గురించి చెప్పిన స్టార్ హీరో !

Published on Dec 9, 2018 10:06 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 165 వ చిత్రం ‘పెటా’. ఈ రోజు ఈచిత్రం యొక్క ఆడియో విడుదలకు వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన పాత్ర ను రివీల్ చేశాడు. ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేశానని ఈ జీతూ అనే పాత్ర సినిమాకు హైలైట్ అవుతుందని అన్నారు. అలాగే సూపర్ స్టార్ రజినీ సర్ తో కలిసి పనిచేయడం నా లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ అని ఆయన దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ‘జిగర్తాండ’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, బాబీ సింహ , సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు