టీడీపీ తో పొత్తుకు బీజేపీ ఒప్పుకుంటుందా, టీడీపీ వ్యూహం ఫలిస్తుందా

టీడీపీ తో పొత్తుకు బీజేపీ ఒప్పుకుంటుందా, టీడీపీ వ్యూహం ఫలిస్తుందా

Published on Feb 23, 2024 11:38 PM IST

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓటమి చవి చూసింది టిడిపి పార్టీ. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా అయినా సరే అధికారాన్ని అందుకోవాలని టిడిపి పార్టీ, ముఖ్యంగా అధినేత చంద్రబాబు అలోచనలు మొదలెట్టారు. ఇప్పటికే తెలుగుదేశంకి మెజారిటీ సీట్లు కేటాయించి, జనసేనకి కొన్ని సీట్లు మాత్రమే ఇచ్చి, బీజేపీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. 

వాళ్ళని కూడా పొత్తులోకి తీసుకుని వాళ్లకు ఇవ్వడానికి 57 సీట్లు రిజర్వ్ చేసి ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఓవైపు జనసేన తో పొత్తు పెట్టుకుని వారికి ఒకవిధంగా అన్యాయం చేస్తూ తమకు తోచిన విధంగా సీట్లు కేటాయిస్తున్న చంద్రబాబు, బిజెపి పార్టీ తో పొత్తు కుదిరితే వారికి కూడా చెప్పేదొకటి చేసేదొకటి చందాన కేటాయింపులు ఇస్తారనేది పలువురు రాజకీయ విశ్లేషకుల మాట. 

ఓవైపు చంద్రబాబు జనసేన కు కేటాయించిన సీట్ల పై జనసేన నేతలు, కార్యకర్తల్లో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అయితే తనకు అవేవి పట్టనట్లు వ్యవ్యహరిస్తోన్న బాబు, పక్కాగా బిజెపితో కూడా పొత్తు పెట్టుకుంటే అధికారం తమదే అనేవిధంగా పావులు కదుపుతున్నారు. మరి టిడిపి తో దోస్తీకి బిజెపి ఎంతవరకు ముందుకు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు