విద్యార్థుల కలలని సాకారం చేస్తున్న ఆంధ్ర ప్రభుత్వం భేష్ – IMF బృందం

విద్యార్థుల కలలని సాకారం చేస్తున్న ఆంధ్ర ప్రభుత్వం భేష్ – IMF బృందం

Published on Sep 26, 2023 9:35 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథాన ముందుకు నడుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అందరూ ప్రసంశలు కురిపిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు తమ కలలని సాకారం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదుగేలా ప్రభుత్వం వారికి అద్భుత విద్యా విధానాన్ని అందిస్తోంది. ఇక తాజాగా మానవ వనరుల పై పెట్టుబడులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ విధానాలను IMF ప్రశంసించింది. ఇతర రాష్ట్రాల కూడా ఈ విధానాలను  అనుకరించాలని ఐఎంఎఫ్ అధికారులు సూచించారు. అమెరికాలో పర్యటిస్తున్న విద్యార్ధి బృందం తాజా వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కార్యలయాన్ని సందర్శించారు. అక్కడి అధికారుల ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌తో సహా భారతదేశ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సుబ్రమణియన్ (మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు)తో విద్యార్థలు భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా IMF అధికారులు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఆత్మస్థైర్యం మరియు ధృడసంకల్పంతో చదువుకుని మన దేశానికి తిరిగి అత్యధికమైన ఉత్సాహంతో పని చేసి దేశ కీర్తి చాటి చెప్పాలని భారతదేశ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సుబ్రమణియన్ అన్నారు. మీ కలలను అనుసరిస్తూ మీరు ఎన్నుకున్న మార్గంలోనే మందుకు సాగి ఎత్తైన శిఖరాలు చేరుకోవాలని IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌ మాట్లాడుతూ తెలిపారు. విద్యార్ధులు జీవితంలో ఎలా విజయం సాధించాలనే దానిపై మార్గదర్శకత్వం, చిట్కాలను స్వీకరించటం గొప్ప విషయమని కె. సుబ్రమణియన్ అన్నారు. 

అయితే విద్యార్ధులకు సుబ్రమణియన్ తన వ్యక్తిగత విజయగాథనే ఉదాహరణగా చెబుతూ, తన చదువే తనని IMF లో ప్రముఖ వ్యక్తిగా నిలబెట్టిందని, యువతకు నిజమైన ప్రేరణగా పనిచేసిందని చెప్పారు. అదేవిధంగా, నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన గీతా గోపీనాథ్‌, IMF లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎదిగేవరకు చేసిన తన కృషిని, తన విశేషమైన ప్రయాణాన్ని విద్యార్ధులతో పంచుకున్నారు. దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అందుకోగలరనే నమ్మకాన్ని విద్యార్థుల్లో నింపేలా ఆమె మాటలు విద్యార్థులను ఎంతగానో ఉత్సాహాన్ని ఇచ్చాయి. 

విద్యార్ధులకు అద్భుతమైన ప్రపంచ వేదికను అందించే లక్ష్యంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పర్యటన, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పనితీరుపై అంతర్దృష్టిని పొందేందుకు మరియు విశేషమైన విజయాన్ని సాధించిన నిష్ణాతులైన వ్యక్తుల నుండి నేర్చుకోవడానికి విద్యార్దులకు ఒక అద్భుతమైన అవకాశంగా పరిగణించవచ్చు. 

మన విద్యార్ధుల్లో స్థైర్యాన్ని నింపిన కె సుబ్రమణియన్ మరియు గీతా గోపీనాథ్ వంటి అధికారుల కృషికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల యొక్క ఈ అద్భుత ప్రతిభ దేశవిదేశాల వారిని ఆకట్టుకుని రాష్ట్రానికి మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టిందని, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థుల యొక్క జీవితాలకు గొప్ప బాటలు వేస్తున్న జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడిందని అంటున్నాయి పలు రాజకీయ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు