పేదల సొంత ఇంటి కల సాకారం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం

పేదల సొంత ఇంటి కల సాకారం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం

Published on Oct 11, 2023 11:21 AM IST

రోజు రోజుకు తన ఆకట్టుకునే అభివృద్ధి పధకాలతో ప్రజలకు ముఖ్యంగా మధ్య, దిగువ తరగతి వర్గాలకు మేలు చేసేలా ముందుకు సాగుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా రాష్ట్రంలో సొంత ఇల్లు లేనివాళ్లు ఉండరాదన్నది సీఎం వైయస్ జగన్ సంకల్పం. అందులో భాగంగా 30.75 లక్షల మందికి రూ.76,000 కోట్ల విలువైన ఇళ్ళ స్థలాలకు సంబంధించి పట్టాలు అందజేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 21.76 లక్షల గృహాలు నిర్మించాలని నిర్ణయించుకుని దానికి రూ.56,700 కోట్లు ఖర్చు అవుతుందని లెక్క వేశారు. పెద్ద మొత్తమే అయినప్పటికీ ఖజానా ఖాళీగా ఉన్న రాష్ట్రంలో ఒకే ఒక పథకానికి అంత బడ్జట్ ఇచ్చి తీరాలన్న దృఢచిత్తం ఉన్న తరువాత ఎటువంటి అడ్డంకులు ఆయనని ఆపలేకపోయాయి.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా జగనన్న కాలనీల కోసం స్థలసేకరణ జరిగింది. అక్కడ ఇళ్ళు నిర్మించేందుకు వీలుగా రోడ్లు, నీళ్లు, విద్యుత్, పార్కుల వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. దీంతో మెల్లగా ఇళ్ల నిర్మాణం మొదలవుతోంది. ఒక్కొక్కరూ తమకు ఇచ్చిన స్థలంలో ప్రభుత్వ సాయంతో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎంత తక్కువగా లెక్కేసినా ఒక్కో ఇంటి ధర ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. అంటే సీఎం వైయస్ జగన్ ఆలోచనలు వాస్తవరూపం దాలుస్తుండడంతో రాష్ట్రంలో పేదల జీవన స్వరూపమే మారుతోంది. ఇళ్లులేని పేదలు ఇక మీదట ఆత్మగౌరవంతో సొంత ఇంట్లో ఉండొచ్చు. ఇప్పటికే ఈ  పథకం కింద 5.24 లక్షల గృహాలు పూర్తవగా వాటిని నేడు లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ క్రమంలో దాదాపు 2412  ఇళ్లను పూర్తి చేసుకున్న సామర్లకోట పట్టణంలో లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు అవుతున్నారు.

ఆ కాలనీల్లో ఇప్పటికే పార్కులు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం అక్కడ నివాసానికి సకలం సమకూర్చింది. ఈ సందర్భంగా లబ్దిదారులతో పాటు సీఎం సైతం వారి సంతోషాల్లో భాగం పంచుకుంటారు. పేదల ఇళ్లలో చిరునవ్వులు పూయించేందుకు సీఎం వైయస్ జగన్ చేస్తున్న కృషి ఫలవంతం అవుతున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సీఎం జగన్ చేపట్టిన ఈ కార్యక్రమంతో ఆయన పై అలానే వైసిపి ప్రభుత్వం పై ప్రజల్లో మరింతగా మంచి నమ్మకం ఏర్పడిందని, అదే వారిని మరొక్కసారి రానున్న 2024 ఎన్నికల్లో అధికారాన్ని అందుకునేలా చేస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు