ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో మంచి పేరు అందుకున్నారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే నాయకులు, నేతలకు పలు సూచనలు చేస్తుండడంతో పాటు పలు ప్రాంతాల్లో అభ్యర్థులని కూడా ఎంపిక చేస్తున్నారు జగన్. విషయం ఏమిటంటే, నేడు అనంతపురం జిల రాప్తాడులో భారీ స్థాయిలో సిద్ధం సభను ఏర్పాటు చేసారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ తో పాటు పలువురు ఆ పార్టీ నేతలు పాల్గొన్న ఈ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి తమ మద్దతు తెలిపారు.
ఇక ఈ సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. సీఎం వైయస్ జగన్ ఆధ్వర్యంలో సిద్ధం 3 కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీస్థాయిలో వైయస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమానికి వచ్చిన వారు ఆ ప్రాంతాన్ని ఫోటోలు తీసి, అప్లోడ్ చేయడంతో ట్విట్టర్, ఫేస్బుక్లు సిద్ధం సభ ఫోటోలతో నిండిపోయాయి. మరోవైపు ట్విట్టర్లో సిద్ధం హ్యాష్ట్యాగ్ దేశంలోనే నంబర్వన్ స్థానంలో 42కె ట్వీట్స్ తో ట్రెండ్ అవుతోంది.
సాక్షి తో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ లో సైతం ఈ సభని వేలాదిమంది వీక్షించడం విశేషం. ఈ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ హాజరుకాకముందే సిద్ధం అప్డేట్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి. జగనన్న రంగంలోకి దిగితే గ్రౌండ్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా షేక్ చేయగలమని ఒక అభిమాని అనగా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ జగనన్న ఇస్ రోరింగ్లైన్ అని మరో అభిమాని అన్నాడు. మొత్తంగా నేడు తాము తలపెట్టిన సిద్ధం సభ ఎంతో విజయవంతం అవడంతో వైసిపి శ్రేణులు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.