చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడిన రాయపాటి రంగారావు

చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడిన రాయపాటి రంగారావు

Published on Jan 11, 2024 9:41 AM IST

తాజాగా టిడిపి పార్టీని వీడిన ఆ పార్టీ సీనియర్ నేత రాయపాటి రంగారావు, బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు, లోకేష్ ల పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. తమ కుటుంబాన్ని అన్నివిధాలా చంద్రబాబు, లోకేష్ నాశనం చేసారని అన్నారు. టిడిపి ఒక వ్యాపార సంస్థ అని, అది ఏమాత్రం రాజకీయ విలువలు లేని పార్టీ అని దుయ్యబట్టారు. 

అలానే సవాల్ చేసి చెప్తున్నా లోకేష్ ను మంగళగిరిలో ఓడిస్తానని, అసలు అతడు అక్కడ ఎలా గెలుస్తాడో చూస్తానని అన్నారు. కియా కంపెనీ నేనే తెచ్చారని చెప్పుకునే చంద్రబాబు మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయారు. గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చంద్రబాబు లోకేష్ ఎక్కడ పనిచెయ్యనిచ్చారని అన్నారు. 

ఇక మరొక టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పని చేస్తాడని కానీ మేము అన్ని కులాలకు పని చేస్తాం అని, ఇకపై టిడిపి మరిన్ని ఎదురుదెబ్బలు తినకతప్పదని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు