అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న వైసిపి చేపట్టిన సిద్ధం సభ ధుం ధాంగా సాగింది. లక్షలాది మంది జనం ఈ సభకు కదం తొక్కారు. సీఎం వైయస్ జగన్ పురిటిగడ్డ అయిన రాయలసీమతో ఆయనకు ఉన్న పట్టు ఆ కటౌట్ కు అక్కడి ప్రజలు ఎంతగా నీరాజనాలు పట్టారు అనేదానికి రాప్తాడు సభ ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా సభా ప్రాంగణంలో ఎటు చూసినా జనం. జగన్ ప్రసంగానికి చేతులు ఊపుతూ స్పందన, అయన మాటలకూ అయన పంచ్ డైలాగులకు ప్రజలు ఉర్రూతలూగారు. సభ జరిగిన మైదానానికి అటు ఇటు కిలోమీటర్లపాడుగునా ట్రాఫిక్ జామ్ అయింది.
సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నలభయ్యేళ్ళ పాలనతోబాటు అయన వ్యక్తిత్వాన్ని కడిగిపారేశారు. ప్రజలను వంచించి నమ్మించి గెలిచాక చంద్రబాబు ఎలా మాట మారుస్తారన్నది ఉదాహారణలతో జగన్ ప్రజలకు వివరించారు. సిద్ధం సభల్లో జగన్ చేసిన ప్రసంగాలు మొత్తం రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణుల మూడ్ ను మార్చేశాయి. వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు అభిమానులు, క్యాడర్, నాయకులకు గొప్ప టానిక్ లా పని చేస్తున్నాయి. దీంతో వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారు. మొత్తంగా వారి ఎత్తులు పారలేదు సరికదా ఈ సభతో వైసిపి ప్రభుత్వం వైపే ప్రజలు ఉన్నారు అనడానికి సాక్ష్యంగా నిలిచిందని, అలానే తప్పకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరొక్కసారి ఆ పార్టీ ప్రభంజనం ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.