వాస్తవాలు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసిపి నూతనాస్త్రం

వాస్తవాలు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసిపి నూతనాస్త్రం

Published on Apr 21, 2024 11:19 PM IST

రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం ఇప్పటికే పలు పార్టీలు గట్టిగా ప్రచారం మొదలెట్టాయి. మరోవైపు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీలో బస్సు యాత్ర చేపట్టి ఇప్పటికే 2000 కిలోమీటర్లకు పైగా పర్యటించారు. ఇక ఎక్కడికక్కడ ప్రజలను కలుసుకుంటూ తాము ఐదేళ్లలో అందించిన సంక్షేమ పధకాలు గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు మరొక్కసారి గెలిస్తే తప్పకుండా ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు సిద్ధమని చెప్తూ సాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఎవరికి అయినా సరే సోషల్ మీడియాలో ప్రకటనలు ఎంతో అవసరం. నేటి సోషల్ మీడియా కాలంలో ఇన్ ఫ్లుయెన్సర్స్ అనే పదం ఇప్పుడు ఓ సెన్షేషన్. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ ఫ్లుయెన్సర్స్.

వీరు ఎలాంటి అంశాన్నైనా అందరికీ అర్థమయ్యేలా సమాచారం ఇస్తారు. దీంతో ఇంటర్నెట్ యూజర్లు వీరికి ఇట్టే అభిమానులుగా మారిపోతున్నారు. సోషల్‌ మీడియాలో వీరి ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. వాళ్లు పెట్టే వీడియోలు పెద్ద చర్చనీయాంశమవుతాయి కూడా. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు అన్ని వర్గాలను ప్రభావితం చేయగలుగుతున్నారు. అందుకే వీళ్లు ఇప్పుడు రాజకీయాలపైనా ప్రభావితం చూపుతున్నారు. వీరు పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయన్న ప్రచారం జోరుగా ఉంది.

ఇందులో భాగంగానే వైయస్ఆర్‌సీపీ కూడా ఇన్ ఫ్లుయెన్సర్స్ తో ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 23న భీమిలిలో ఇన్ ఫ్లుయెన్సర్స్ తో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైయస్ఆర్‌సీపీకి అనుబంధంగా పనిచేస్తున్నవారు హాజరవుతారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్తలు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సోషల్ మీడియా నిర్వాహకులు ఇన్ ఫ్లుయెన్సర్స్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రానున్న ఈ కొద్దికాలం మన పార్టీకి ఎంతో విలువైనది.

ఈ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి, జగనన్న పాలనలో సాధించిన విజయాలు ప్రజలకు దక్కిన సంక్షేమం, వారికి లభించిన రాజకీయ, సామాజిక ప్రాధాన్యం లాంటి అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలా కృషి చేయాలన్నది ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం చేస్తారు. తప్పకుండా ఈ ఇన్ ఫ్లుయెన్సర్స్ మీట్ వైసిపికి మరింత మేలు చేసే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు