‘లౌక్యం’ సినిమా చూసిన బాలకృష్ణ & ఫ్యామిలీ.

‘లౌక్యం’ సినిమా చూసిన బాలకృష్ణ & ఫ్యామిలీ.

Published on Sep 30, 2014 10:19 PM IST

balakrishna
గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘లౌక్యం’. నందమూరి బాలకృష్ణ మరియు ఇతర కుటుంబ సభ్యులు ‘లౌక్యం’ సినిమాను మంగళవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో వీక్షించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు బాలకృష్ణ సోదరి పురందేశ్వరి కూడా హాజరయ్యారు. ప్రసాద్ లాబ్స్ స్క్రీన్ 2లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.

గత శుక్రవారం విడుదలైన ‘లౌక్యం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. బ్రాహ్మి, చంద్ర మోహన్, 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెడీకి విశేష స్పందన లభించింది. ప్రేక్షకులను నవ్వించింది. శ్రీవాస్ దర్శకత్వం, గోపీచంద్ నటన, అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాను హిట్ చేయడంలో ముఖ్య భూమిక పోషించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు