‘దండుపాళ్యం’ సీక్వెల్ లో ప్రకాష్ రాజ్..?

‘దండుపాళ్యం’ సీక్వెల్ లో ప్రకాష్ రాజ్..?

Published on Jul 25, 2014 1:30 AM IST

Prakash-Raj_Dandupalyam
కర్ణాటకలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా కన్నడలో దర్శకుడు శ్రీనివాస రాజు రూపొందిన సినిమా ‘దండుపాళ్య’. తెలుగు, తమిళ భాషలలో ‘దండుపాళ్యం’ పేరుతో ఈ సినిమా అనువదించారు. బోల్డ్ కంటెంట్ సినిమాగా విమర్శకుల ప్రసంశలు పొందింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని దర్శకుడు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

‘దండుపాళ్యం’ సీక్వెల్ లో ప్రాముఖ్యత కలిగిన పాత్రలో ప్రకాష్ రాజ్ ను నటింపజేయడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. విలక్షణ నటుడిని కలసి కథ కూడా వినిపించారు. అయితే ప్రకాష్ రాజ్ ఓకే చెప్పారో..? లేదో..? తెలియదు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటిస్తున్నారు.

‘దండుపాళ్యం’లో కన్నడ హీరోయిన్ పూజా గాంధీ, రఘు ముఖర్జీ, రవి శంకర్, నిషా కొఠరి నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు