అభిమాని మృతి పట్ల తీవ్ర ద్రిగ్బ్రాంతి వ్యక్తం చేసిన చరణ్

అభిమాని మృతి పట్ల తీవ్ర ద్రిగ్బ్రాంతి వ్యక్తం చేసిన చరణ్

Published on Oct 1, 2014 2:45 PM IST

Ram-Charan_interview-1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ ఈ రోజు విడుదలయింది. దురదృష్టవశాత్తు.. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో కన్నయ్య అనే మెగా అభిమాని మృతి చెందారు. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ తీవ్ర ద్రిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అభిమాని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు. అతని మృతి కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్టు ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు