వరుణ్ తేజ్ కొత్త సినిమా మొదలైంది..!

వరుణ్ తేజ్ కొత్త సినిమా మొదలైంది..!

Published on Apr 28, 2016 2:20 PM IST

venkatesh
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, దర్శకుడు శ్రీనువైట్లల కాంబినేషన్‍లో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’ లాంటి పరాజయాల తర్వాత ఎలాగైనా తన స్థాయి సినిమా తీయాలన్న ఆలోచనతో శ్రీనువైట్ల ఈ ప్రాజెక్టు కోసం చాలా నెలలుగా కష్టపడుతూ వస్తున్నారు. ఇక అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసిన టీమ్ నేడు సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై వరుణ్ తేజ్, శ్రీనువైట్లలకు శుభాకాంక్షలు తెలిపారు.

వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు. ఇక త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని దర్శక, నిర్మాతలు లాంచ్ సందర్భంగా తెలియజేశారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేం హెబ్బా పటేల్ ఈ సినిమాలో ఓ కీ రోల్ చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు