సెన్సార్ పూర్తి చేసుకున్న ‘విన్నర్’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘విన్నర్’ !

Published on Feb 17, 2017 6:20 PM IST


మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విన్నర్’. దర్శకుడు గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తాలూకు పాటలు ఒక్కొక్కటిగా విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. టీజర్, ట్రైలర్స్ కూడా బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. పైగా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తేజ్ కెరీర్లోనే మంచి కమర్షియల్ హిట్ గా నిలవనుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇకపోతే ఈ చిత్రం తాజా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు దీనికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో చిత్రం ముందుగా అనుకున్నట్టే శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది. ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు అనూప్ సింగ్ ఠాకూర్, జగపతి బాబులు విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు