‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతల కాన్ఫిడెన్స్ పీక్స్‌లో ఉందిగా

‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతల కాన్ఫిడెన్స్ పీక్స్‌లో ఉందిగా

Published on Oct 13, 2019 9:10 AM IST

2020 సంక్రాంతికి విడుదలకాబోయే సినిమాల జాబితాలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ యొక్క ‘అల వైకుంఠపురములో’, మహేష్ బాబు, అనిల్ రావిపూడిల ‘సరిలేర నీకెవ్వరు’ చిత్రాలు కన్ఫర్మ్ అయ్యాయి. రెండు సినిమాలు జనవరి 12న విడుదలకానున్నాయి. దీంతో పోటీ హోరాహోరీగా ఉండనుంది. రెండు సినిమాల మీద అంచనాలు విపరీతంగా ఉండటంతో వసూళ్ల విషయంలో తీవ్రమైన పోటీ ఉంటుంది.

రెండు సినిమాలు మొదటిరోజే మంచి టాక్ తెచ్చుకోవాలి. అలా కాకుండా ఒక సినిమా బాగుందని, ఇంకొకటి బాగోలేదని అనిపిస్తే మాత్రం నెగెటివ్ టాక్ వచ్చిన సినిమా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. కానీ చిత్ర నిర్మాతల కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం రెండూ బాగానే ఉంటాయంనే నమ్మకం కలుగుతోంది.

‘అల వైకుంఠపురములో’ నిర్మాతలు ఎట్టి పరిస్థితిలో సినిమా విజయం సాధించి తీరుతుందని భావిస్తుండగా ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాత అనిల్ సుంకర కూడా చిత్రం ఖచ్చితంగా అలరిస్తుందని, వినోదం, యాక్షన్ కలగలిసి ఉంటాయని ప్రామిస్ చేస్తున్నారు. నిర్మాతలు ఇంత ధీమాగా ఉన్నారంటే చిత్రాల్లో మంచి విషయమే ఉండి ఉంటుంది. మరి ఏ చిత్రం ఏ స్థాయిలో అలరిస్తుంది, ఎవరు ఎవర్ని డామినేట్ చేస్తారో చూడాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు