ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మైనపు విగ్రహం ను దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) లో ఆవిష్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ తొలి చిత్రం నుండి ఈ రేంజ్ వరకూ ఎదగడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. అల్లు అర్జున్ సోదరుడు అయిన అల్లు శిరీష్ ఈ మేరకు బన్నీ జర్నీ ను గుర్తు చేస్తూ, సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశారు.
15 సంవత్సరాల క్రితం మేడమ్ టుస్సాడ్స్ సందర్శించడానికి పర్యాటకులుగా వెళ్ళాము. ఒకరోజు మీ స్వంత విగ్రహంతో దాన్ని క్లిక్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. వాటే జర్నీ! నిన్ను చూసి గర్వపడుతున్నాను. అంతేకాక అప్పుడు దిగిన ఫోటోలను కూడా జత చేశారు. అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. పోస్ట్ వైరల్ గా మారుతోంది. బన్నీ నెక్స్ట్ పుష్ప 2 ది రూల్ చిత్రం లో కనిపించనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల రిలీజ్ కి రెడీ అవుతోంది.
15 years back we were excited as tourists to visit Madam Tussauds and click pictures. Never ever thought one day I'll be clicking it with your own statue. Whatte journey! Proud of you ????@alluarjun pic.twitter.com/SFMdsKDXMs
— Allu Sirish (@AlluSirish) March 29, 2024