సీఎం జగన్‌ను కలవనున్న చిరంజీవి.. కారణం !

సీఎం జగన్‌ను కలవనున్న చిరంజీవి.. కారణం !

Published on Oct 10, 2019 4:05 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవనున్నారు. కొన్నిరోజుల క్రితమే ఆయన సీఎంను కలవాలని అనుకుంటున్నట్టు సిఎంఓకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి తెలుపగా అయన శుక్రవారం ఉదయం 11 గంటలకు కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది చిరంజీవికి తెలిపారు.

చిరుతో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం జగన్‌ను కలవనున్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆయన్ను చిరు కలవనుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ మీటింగ్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఫిల్మ్ నగర్ జనాలు మాత్రం ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని, ‘సైరా’ చిత్రానికి స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చినందుకుగాను కృతఙ్ఞతలు తెలిపి గవర్నర్ తమిళసైను ఎలాగైతే స్పెషల్ షోకు ఆహ్వానించారో అలాగే ముఖ్యమంత్రిని కూడా
సినిమాను వీక్షించేందుకు ఆహ్వానించడానికే ఈ మీటింగ్ అని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు