కాంతార పై మెహర్ రమేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కాంతార పై మెహర్ రమేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Oct 26, 2022 7:14 AM IST


శాండల్ వుడ్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించిన విలేజ్ యాక్షన్ డ్రామా కాంతార. కన్నడ లో చిన్న చిత్రం గా విడుదల అయి, ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం పై టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా వైభవానికి సాక్షి కాంతార చిత్రం. గ్రామీణ భారతదేశం లో దైవిక ఆధ్యాత్మిక కథలు ఇలా ఎప్పుడూ చెప్పలేదు అని పేర్కొన్నారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఎక్కువగా వీక్షించిన చిత్రం గా కాంతార చిత్రం నిలిచింది అని తెలిపారు. రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం కి విజయ్ కిరగందూర్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు