కష్టాలు తొలగాయి.. నిఖిల్ సినిమా విడుదలకు రెడీ

కష్టాలు తొలగాయి.. నిఖిల్ సినిమా విడుదలకు రెడీ

Published on Sep 29, 2019 7:56 PM IST

యంగ్ హీరో నిఖిల్ నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చిత్రీకరణతో పాటు అన్ని పనులు పూర్తై కొన్ని నెలలు గడిచినా విడుదలకు నోచుకోలేదు. మే, జూన్ అంటూ వాయిదాపడుతూనే వచ్చింది. ఈ వాయిదాల పర్వంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది. నిఖిల్ సైతం ఈ సినిమా విషయంలో చాలా సఫర్ అయ్యాడు.

ఎట్టకేలకు ఆ అడ్డంకులన్నీ తొలగినట్టున్నాయి. సినిమాకు కొత్త రిలీజ్ డేట్ దొరికింది. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు ఇన్నాళ్లు మిమల్ని వెయిట్ చేయించానని తెలుసు.. ఓపికగా ఎదురుచూసినందుకు థాంక్స్ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి అన్నారు. మరి ఆ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.

ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటించింది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు