ఏప్రిల్లో రాబోతున్న గ్రీకువీరుడు

ఏప్రిల్లో రాబోతున్న గ్రీకువీరుడు

Published on Feb 13, 2013 7:50 PM IST

Greekuveerudu
అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ గ్రీకు వీరుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నాగార్జునతో సంతోషం లాంటి బ్యూటిఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ అందించిన దశరద్ డైరెక్ట్ చేస్తున్న గ్రీకు వీరుడు ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆడియోని మార్చ్ నెలాఖరుకు విడుదల చేసి సినిమాని ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. వేసవి సెలవుల సీజన్ కావడంతో సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మార్చ్ 28న వెంకటేష్ షాడో విడుదల కాబోతుండగా ఏప్రిల్ 5న ఎన్టీఆర్ బాద్షా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాల తరువాత వేసవి సెలవుల్లో వచ్చే పెద్ద సినిమా గ్రీకువీరుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు